ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తు్న్న విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22, సోమవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటలకు ఫలితాలను విజయవాడలోని తాజ్ హోటల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు.
ఫలితాల ప్రకటన అనంతరం స్టూడెంట్స్ తమ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి schools360 వెబ్ సైట్లో క్షణాల వ్యవధిలో ఫలితాలను తెలుసుకోవచ్చు. దీంతో పాటు పదో తరగతి మార్కుల మెమోను స్టూడెంట్స్ చెక్ చేసి, డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Pratap is mass communication and journalism post-graduate, has over seven years experience working as Education Domain. Research on current trends is his main Hobby.